Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12146

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: ఆహిరి

మరుతంత్రములలోన మరఁగేఁటికి
శిరసు వంచి మొక్కేను చెప్పరే యాతనికి॥పల్లవి॥
  
  
తమి యేలరేఁచినే తరితీపేల సేసీనే
సముకాన నున్నదానఁ జనవరిని
కొమరె వయసుదానఁ గుదురుకొనె వలపు
చెమటలు మేననిండెఁ జెప్పరే యాతనికి॥॥
  
  
సెలవినేల నవ్వీనే సిగ్గులేల నెరపీనే
చెలిమి చేసినదాన సేవచేసేను
నలుగడ నివ్వెరగై నామనసు తనకె
సెలవు సేసితినని చెప్పరే యాతనికి॥॥
  
  
సన్నలేల సేసీనే చన్నులేల పిసికీనే
వున్నతిఁ దనకాఁగిట కున్నదానను
యిన్నిటా శ్రీ వేంకటాశుఁ డింత లోఁదా నన్నునేలె
చెన్నగునాసంతోసము చెప్పరే యాతనికి॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!