Bhimalapuram co in

వీరభద్ర విజయము

సంక్షిప్తరూపము

వీరభద్ర విజయము

ప్రథమాశ్వాసము

దేవతా ప్రార్థన

అని నిఖిలదేవతా ప్రార్థనంబుఁ జేసి. 3

7-వ.అని యిష్టదేవతాప్రార్థనంబు సేసి.7

 

పీఠిక

12-వ.తత్ప్రాసాద కరుణావిశేష ప్రవర్థమాన కవితామహత్వ సంపన్నుండ నై మదీ యాంతరంగంబున.12

14-వ.తదీయ విచారచిత్తుండ నై త త్కథారంభం బూహించుచున్న సమయం బున.14

17-వ.ఒక్కనాఁ డసమానమానసుం డై యగమ్య రత్నాంచిత మగు వేదికా తలంబున సమున్నత కనకాసనంబున సుఖం బుండి శైవపురాణ ప్రసంగాంతరంగుం డై నన్ను రావించిన.17

19-వ.అ య్యవసరంబున సోమశేఖరుం డి ట్లనియె.19

22-వ.అదియునుం గాక. నీకు వీరభద్రేశ్వరప్రసాదంబుఁ గలదు. కావున వాయుపురాణ సారం బగు నీ కథావృత్తాంతం బంతయు దెలుంగున రచియింపు” మని యానతిచ్చిన మద్గురుని మధురవాక్యంబులకు నత్యంతానురాగ సంతుష్టుండనై తదీ యానుమతంబున మదీయ వంశావళి వర్ణనం బొనరించెద.22

కవివంశాభివర్ణన

25-వ.అట్టి వసిష్ఠపుత్రుం డగు కౌండిన్యుండు.25

27-వ.అట్టి కౌండిన్య గోత్రంబునం దాపస్తంబసూత్రంబున.27

40-వ. త దనుజుండ నై యేను జన్మించి పోతయ నామధేయుండ నై పరఁగి జనకశిక్షిత విహితాక్షరాస్యుండ నై వీరభద్రప్రసాద లబ్ద కవితాతిశయం బున.40

షష్ఠ్యంతములు

42-వ. కరుణాంచితగుణమణికిని సురుచిరబాలేందుబింబచూడామణికిన్ వరదైవశిఖామణికిని జిరతరధీమణికి భక్తచింతామణికిన్.42

కథాప్రారంభము

45-వ.మత్సమర్పితం బగు వితతవిస్ఫురిత వీరభద్రవిజయాంచిత కథా ప్రసంగ ప్రారంభం బెట్టి దనిన; మహిత మాతులుంగ మందార చందన సాల భల్లతకీ ప్రముఖరాజిత కుంభినీ విరాజితంబును; కురువింద కుందమ హిమ్లాత మధుక శతపత్ర కమల కల్హార కరవీర మల్లి కాది వల్లీ సంఫుల్ల పుష్పవల్లీ లలిత పరిమళ సుగంధబంధుర దిగంతరాళంబును; నిజ విరోధంబుఁ దొరంగినగతి వసియించు చంచరీక శారికా కీరనాకీల చక్రవాక నీలకంఠ కనకనయన కంక నాళలింగ క్రౌంచ కారంభ కారండ కానకపోత పారావత శకుని భరద్వాజ చకోర లావుక జీవంజీవవాయ సారాతి కోయష్టిక డిండిభసార సశాతఖండ నారంగత్పదారంగ గణనాద ప్రమోదితంబును; మండిత గడభేరుండ వేదండ కంఠీరవ శరభ శార్దూల శంబర జంబూక గవయ వరారోహ ప్లవంగ శల్య సారంగ చమరీమృగ గోకర్ణ వృకాది మహామృగ మందిరంబును; దందశూక గాధేయ మార్జాల మూషక నివాసంబును; సకల పుణ్య తరంగిణీ మంగళ సంగమంబును; వినిర్మల సరోవర విలసితంబును; అనుపమ మునినాద నిరంతర బహుళ పాఠ నిఖిల నిగమ కలకలారావ ఘటిత గగన తలంబును; ధర్మ తపోధన ధాన్య దాన తాపసోత్తమ సంతత సంతుష్ట హోమ ధూమ సమ్మిళిత బృందారకాలోకనంబును; సర్వభువన మహారణ్యరత్నంబును; సకల మునిజనస్తోత్ర పాత్రంబును నగు నైమిశారణ్యపుణ్యక్షేత్రంబు నందు.45

49-వ.అని మఱియు బహుప్రకారంబుల నమ్మహామునులు సంస్తుతింప న వ్వాయుదేవుం డగణిత సంతోషమానసుం డై యిట్లనియె.49

51-వ.ఐనను నానేర్చువిధంబున మీ యడిగిన యర్థంబు సవిస్తరంబుగా వినిపింతు” నని య మ్మహామునులకు వాయుదేవుం డి ట్లనియె.51

53-వ.ఇట్లు పరమేశ్వరుండు రజతధరణీధరశిఖరంబున నగణ్యరమ్యతర రత్నసింహాసనం బునం గొలు వున్న సమయంబున.53

66-వ.ఇ వ్విధంబున.66

68-వ.ఇ ట్లరుగుదెంచి సకలభువనప్రధానదేవతలును, సప్తలోకపాలురును, సనకసనంద నాది యోగీంద్రులును, సిద్ధ కిన్నర కింపురుష గరుడ గంధర్వ విద్యాధరులును, మార్కండేయ ఘటజ మరీచి గౌతమ కశ్యప వామదే వాత్రి భృగు దధీ చ్యుపమన్యు దుర్వాస నారదాదులగు మహామునులును, ననంత సంతసంబునఁ గలధౌతకుధర శిఖరంబుఁ బ్రవేశించి దేవదేవుని దివ్యాలయంబు డాయం బోయి తదీయ ద్వారంబున నందఱుం బాదచారులై దౌవారికు లగు జయవిజయుల నాలోకించి యి ట్లనిరి.68

70-వ.అని పలికిన వారును నగుఁగా కని శంకరు నాస్థానమండపంబు దరియంజొచ్చి య ద్దేవునకు నమస్కారంబు లాచరించి యి ట్లనిరి.70

72-వ.అనవుఁడు న వ్విన్నపం బవధరించి “వారలం దోడితెం డని యాన తిచ్చిన” వారును జని దేవతల కి ట్లనిరి.72

75-వ.ఇ వ్విధంబునఁ గొలువుచొచ్చి యమ్మహాదేవునింగాంచి సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి నిటలతట సంఘటిత ముకుళిత కర కమలులును, సర్వాంగ పులకాంకితులును నై యి ట్లని స్తుతియింపం దొడంగిరి.75

78-వ.అని మఱియు ననేకవిధంబుల నుతియించి తత్ప్రసాద కరుణా విశేషంబుల నానందించి యుచితాసనంబుల నుండి; రక్కొలు వగమ్య రమ్య నిఖిల దేవతాజన కిరీట కీలిత దివ్యమణి ప్రభాపటల దేదీప్యమాన తేజోమహిమాభిరామంబును, అగణిత గణాలంకృతం బును, నసమాన మానితంబును, అనంత వైభవ ప్రమోదితంబును నై యొప్పుచున్న సమయంబున.78

80వ.ఇట్లు పరమేశ్వరుం డడిగిన నందఱు నాలాగునఁ దమతమ పరిణామంబులు విన్నవించి “దేవా భవదీయకరుణావిశేషంబున సర్వ సంపన్నం బై యుండుఁ గావున మాకు నే కార్యంబును నప్రతిహతంబై చెల్లుచుండు” నని పలికి సుఖగోష్ఠి నున్న సమయంబున.80

దక్షుఁడు రజతగిరి కరుగుట

83-వ.ఇ ట్లఖిల భువనాధీశ్వరుండు గారవించిన.

86-వ.ఇట్లు దేవదేవుని మహత్వంబుఁ దెలియక వృధావైరంబున దక్షుం డటువాసి చనియె, నంత న మ్మహేశ్వరుఁ గొల్వవచ్చిన దేవేంద్రాది బృందారక సంఘంబులు పునః పునః ప్రణామంబు లాచరించి చనిరి తదనంతరంబ.86

92-వ. దక్షుం డి ట్లనియె.92

దక్షుఁడు దివిజులఁ బిలుచుట

నారదుఁడు పార్వతికి దక్షుఁడు యఙ్ఞముఁ దెలుపుట

102-వ.అని విన్నవించి.

114-వ.పరమేశ్వరుం డి ట్లనియె.114

119-వ.ఇట్లని.119

121-వ.అప్పుడు దరహసితవదనుండై య ప్పరమేశ్వరుం డి ట్లనియె.121

దాక్షాయణి దక్షు నింటి కరుగుట

124-వ.అంత నప్పరమేశ్వరియు నమ్మహాదేవునకు వినయ భృతాంతఃరకణ యై సాష్టాంగ దండప్రణామంబు లాచరించి య మ్మహాదేవు ననేక ప్రకారంబుల నుతియించి య ద్దేవు ననుమతంబున నానాసహస్రకోటి తరణికిరణ ప్రభోజ్జ్వలంబై నభోభాగంబు విడంబించు సువర్ణాంచితం బగు దివ్యవిమానంబుఁ బ్రవేశించి యందు సుందర రత్నాంచితాస నాసీన యై యుండు నవసరంబున.124

126-వ.ఇవ్విధంబున న మ్మహాదేవి చెలికత్తెలు మొత్తంబులై తమలో బహు ప్రకారంబులఁ బను లేర్పఱిచికొని ప్రమథగణసుందరీ సమేతంబుగా గజకర్ణ లంబోదర సూర్యవర్ణ సోమవర్ణ శతమాయ మహామాయ మహేశ మృత్యుహరాదులు మొదలుగాఁ గల మహా ప్రమథగణంబులు గొలువ దివ్యవిమానారూఢయై యుండె నప్ప డ వ్విమానంబు ముదంబున గడపం దొడంగి రంత నదియును మనోవేగంబున దక్షుని యాగమంటపమ్ముఁ గదిసిన న క్కన్యారత్నంబు తన సఖీజనంబులుం దానును గగనగమనంబు డిగ్గి.126

129-వ.ఇట్లు నడచి.129

దక్షుఁడు దాక్షాయణిం దిరస్కరించుట

142-వ.అనవుఁడు న మ్మహాదేవి కోపవివశ యై య య్యాగమంటపంబున సుఖాసీనులై యున్న సభాపతుల నవలోకించి యి ట్లనియె.

149-వ.అదియునుం గాక.149

162-వ. అంతఁ దత్ప్రకారంబు వీక్షించి దక్ష మఖమంటపంబున సుఖాసీనులై యున్న బ్రహ్మ విష్ణు సూర్య చంద్ర దేవేంద్ర దండధర వరుణ కుబేరాది దేవజనంబులు మహాభీత చిత్తు లైరి; మూర్తిమంతంబు లైన మంత్రంబులు తంత్రంబులు చాలించె; పాప కర్ముం డగు దక్షుని నిందించి బ్రహ్మ తన లోకంబునకుఁ బోయె; మఱియుఁ దక్కిన వార లందఱు తమతమ నివాసంబులకుం జనిరి తత్సమయంబున.162

శంకరుండు దక్షునకు శాపం బిచ్చుట

164-వ.అని మఱిఁయుఁ బరమేశ్వరుండు గౌరీదేవి ననంత కరుణాపూరిత మానసుం డై తలంచి వెండియుఁ దన మనంబున.164

166-వ.ఇట్లు పరమేశ్వరుండు శాపం బిచ్చిన దక్షుండు దదీయ ప్రకారంబు నొందె నంత.166

దాక్షాయణి హిమవత్ప్రుత్త్రియై పుట్టుట

169-వ.అనిన నా కుమారీతిలం బి ట్లనియె.169

182-వ.అని యనేక విధంబుల నుతించి మఱిఁయుఁ దుహినధరణీధర నాయకం డి ట్లనియె.182

184-వ.ఇట్లు ప్రసన్నయైయున్న న మ్మహీధరనాయకుం డి ట్లనియె.184

192-వ.ఇట్లు పార్వతీమహాదేవి డాయ నేతెంచి.192

194-వ.అప్పు డి ట్లనియె.194

201-వ.ఇ వ్విధంబున.201

208-వ.కని య మ్మహావనంబు దరియంజొచ్చి తత్ప్రదేశంబున.208

212-వ.అని విచారించి.212

????????216?????

217-వ.పరమ సమ్మోదంబున న మ్మహాత్మునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి కరకమలంబులు ముకుళించి యి ట్లనియె.217

223-వ.ఇ వ్విధంబునం బరమేశ్వరునకుఁ బరిచర్యలు సేయ న మ్మహాదేవిని సమర్పించి యతం డ ద్దేవునకు వెండియు దండప్రణామంబు చేసి తన మందిరంబునకుఁ జనియె నంతఁ.223

228-వ. ఇ వ్విధంబున గొంతకాలంబు దేవి దేవరకుం బరిచ్రయలు సేయు చుండె నని చెప్పి"228

ఉపశృతి

231-గ. ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యశ్రీ పాదప ద్మారాధక కేసనామాత్యపుత్ర పోతయనామధేయ ప్రణీతంబైన వీరభద్ర విజయం బను మహా పురాణకథ యందు దేవేంద్రాది దేవగణంబులు శివుని సందర్శనంబు సేయుటయు దక్షయాగంబును దాక్షాయణి నారదు వలన విని శంభుని కెఱింగించుటయు శంభుండు పనుప దివ్యరథా రూఢ యై పార్వతీదేవి దక్షు నింటికి వచ్చుటయు దక్షుఁడు సేయు శివనింద వినఁజాలక య మ్మహాదేవి దేహంబు దొఱఁగుటయు హిమవంతునికిఁ గుమారియై శాంకరి పొడచూపుటయు తదీయ తపో మహత్త్వంబును నగజ శివునకుఁ బరిచర్యలు సేయుటయు నన్నది ప్రథమాశ్వాసము.231

 

ద్వితీయాశ్వాసము

తారకుఁడు దండై పోవుట

2-వ. పరమఙ్ఞానభావుం డగు వాయుదేవుం డ మ్మహామునుల కి ట్లనియె.2

4-వ. ఇట్లు పోయి.4

7-వ. సురాచార్యుండు బ్రహ్మదేవున కి ట్లనియె.7

10-వ. అనవుఁడు దరహసిత వదనుం డై రాజీవభవుం డి ట్లనియె.10

12-వ. అని మఱియును.12

14-వ. అని కమలసంభవుండు విచారించి కార్యంబు తేటవడం బలికిన నగుఁ గాక యని మహా మోదంబున.14

16-వ. అ ట్లేఁగి నాకంబు నందు.16

20-వ. అ య్యవసరంబున.20

25-వ. ఆ యువతికి సుమసాయకుం డి ట్లనియె.25

30-వ. ఇ ట్లగణ్యశృంగారవైభవాడంబరుం డై రతీదేవి దీవెనలు గైకొని వీడ్కొని కదలి య క్కంధరుం డమరేంద్రపురంబునకుం బ్రయాణంబు చేసి గగనంబున వచ్చుచు.30

అమరావతీ వర్ణనము

32-వ. కనుంగొని యనంత వైభవంబున న న్నగరంబు ప్రవేశించి గోవింద నందనుం డసమాన సుందరుం డై చనుదెంచుచున్న సమయంబున.32

35-వ. అంత న ద్దేవేంద్రు మందిరంబు చేరం బోయి.35

37-వ. ఇట్లు దివ్యాస్ఠానమంటపంబు దరియం జొచ్చి.37

39-వ. ఇట్లు పొడఁగాంచి నిరుపమ నయ వినయ భయజనిత మానసుండై నమస్కారంబు చేసిన కుసుమసాయకం గనుంగొని విపుల ప్రమోదంబున నెదురు వచ్చి వలదు తగ దని బాహు పల్లవంబుల నల్లన యెత్తి పలు మాఱు నందందఁ గౌఁగలించుకొని దేవేంద్రుఁడును నతులిత తేజో మహి మాభిరామ కనక మణి గణాలంకార సింహాస నాసీనుం జేసి మఱియు నొక్క దివ్య హారంబు సమర్పించి మహనీయ మధుర వచనముల ని ట్లనియె.39

41-వ. అని మహేంద్రుం డడిగిన నంగసంభవుం డి ట్లనియె.41

43-వ. అనిన విని పురందరుం డిందిరానందనున కి ట్లనియె.43

49-వ. అని ప్రియంబులు పలుకుచున్న పురందరుం గనుంగొని కందర్పుం డి ట్లనియె.49

54-వ. అదియునుం గాక.55-సీ.పుండరీకాక్షుని పుత్రుండ నై నేనునిభచర్మధరునిపై నెట్లు వోదు పోయిన న ద్దేవు భూరి ప్రతాపాగ్నినెరయంగ నా తేజ మెందు మోచు మోచిన పరమేశుమూర్తి యేఁ గనుఁగొనియెదిరి విజృంభించి యెట్లు వత్తు వచ్చిన మా తండ్రి వావిరిఁ గోపించియే చూపు చూచునో యేను వెఱతు ఆ. వెఱతు నయ్య యెన్ని విధములఁ జెప్పిన కొలఁది గాదు నా కగోచరంబు నిక్క మి వ్విధంబు నీ యాన దేవేంద్ర! మృగకులేంద్రు నోర్వ మృగము వశమె.”54

55???????

56-వ. అనవుడు రతీమనోహరునకు శచీమనోహరుం డి ట్లనియె. 57-ఆ.“పొందుగాని పనికి పొమ్మందునే నిన్ను నింత చింత యేల యిట్టి పనికి దర్పచిత్తుఁ డైన తారకాసురు చేతి బాధ మాన్పి కీర్తిఁ బడయు మయ్య!”

64-వ. అని మఱియును బ్రియంబును కఱకును దొరల నాడు దేవేంద్రు వచనంబు వచనంబులకు విహ్వలీకృత మానసుం డై కొంత ప్రొద్దు విచారించి యెట్టకేలకు నొడంబడి “సురేంద్రా! భవదీయ మనోరథంబు సఫలంబుఁ జేసెద” నని పల్కి మఱియు ని ట్లనియె.64

66-వ. అనిన విని పురంద రాది దేవ గణంబులు బహు ప్రకారంబుల నంగజాతుని వినుతించి వీడ్కొల్పిన నత్యంత కర్మపాశ బద్ద మానసుం డై నిజ మందిరంబునకుం జనియె. కందర్పుఁడు రతీదేవికి తా నరిగిన వృత్తాంతంబు చెప్పుట66

69-వ. అని పలికినఁ బ్రాణవల్లభ వదనం బాలోకించి పంచబాణుం డి ట్లనియె.69

71-వ. అనవుడు నక్కాంతాతిలకంబు విస్మయాకుల చిత్త యై మూర్ఛిల్లి తెలువొంది నగవును గోపంబును దైన్యంబును సుడివడుచుండ ని ట్లనియె.71

73-వ. అదియునుం గాక. 73

80-వ. మఱియు ని ట్లనియె.80

86-వ. అని పల్కి మరుండు మదాంధ సింధురంబునుం బోలె నతులిత మదోద్రేక్రమానసుం డై త దవసరంబున.86

90-వ. అ య్యవసరంబున.90

93-వ. అంత93

95-వ. ఇట్లు మహిమాతిశయం బగు సుమరథం బాయత్తంబు చేసి వసంతుఁ డనంత వైభవంబున నంగసంభవుం గాంచి “దేవర యానతిచ్చిన విధంబునఁ దే రాయత్తంబు చేసి తెచ్చితి; నదియునుం గాక పిక మధుర మరాళ సేనా నాయకుల దండు గండు మొనలై రతీంద్రా! నీ రాక గోరుచు మొగసాల నున్నవా” రని విన్నవించిన నవధరించి పురారాతిమీఁద దండు గమకించి మెయి వెంచి విజృంభించి సమంచిత పుష్ప బా ణానన తూణీర సమేతుండును; ద్రిభువన భవ నాభినవ సుందరుండును; రంగద్భృంగ మంగళ సంగీత పాఠ కానేక నిర్మల మహనీయ నాద మోదిత మానసుండును; భూరి కీర కైవార నిజ గు ణాలంకారుండును; కలహంస నాద గణ పరివృతుండును; నగణ్య పుష్ప రథారూఢుండును; జగన్మోహనుండును; నగోచర చారు శృంగారుండును; హార కేయూర మణిమకు టాభిరాముండును; రమణీయ రతిరామా సంయుతుండును; కలకంఠ కీర సే నాధిష్ఠితుండును; బల్లవ ఛత్ర చామర కేత నాలంకృతుండు నై నభోభాగంబునం బోవు చుండె న య్యవసరంబున.95

97-వ. కని య మ్మా వనంబు దరింయ జొచ్చి. 98-సీ.తన మనోవీథి పై దర్పంబు రెట్టించి;చెన్నొంద వెడవిల్లుఁ జేతఁ బట్టి; దట్టపు మొల్లలు తలజొమ్మికము వెట్టి;సొంపారఁ బూవులజోడుఁ దొడిగి; తన బలంబుల నెల్ల మొనలుగాఁ గావించి;కలువలు తూణీరములు ధరించి; యక్కజముగ మీన టెక్కె మెత్తించి; రాచిల్కల తేరెక్కి; చివురు గొడుగు ఆ. బాలకోకిలంబు బట్టంగఁ గడువేడ్కగీర చయము తన్నుఁ గీర్తి సేయ గమ్మగాలితోడఁ గదన సన్నద్ధుఁ డై కాముఁ డేగె సోమజూటు కడకు.97

98???????

99-వ. ఇ వ్విధంబున నత్యంక సమ్మదంబున సకల సన్నాహ బల పరి వృతుం డై నిదురబోయిన పంచాననంబు నందంద మేలుకొలుపు మదగజంబు చందంబున నిందిరానందనుండు నిరుపమ నిర్వాణ నిర్వంచక నిర్విషయ నిరానంద మానసుండును; సకల బ్రహ్మాండ భాండ సందోహ విలంబిత నిర్మల పరమ భద్రాసీన దివ్య యోగ ధ్యాన సంతత భరి తాతంరంగుండును; నిర్గుణుండును; నిర్వికారుండును నై తన్నుం దాన తలపోయుచు నశ్రాంత సచ్చిదానంద హృదయుం డగు న మ్మహేశ్వరుం గాంచి యల్ల నల్లన డాయం బోయి తదీ యాభిముఖుం డై మనోభవుండు.99

104-వ. ఆ సమయంబున.104

108-వ. ఇట్లు చూచిన.108

112-వ. అంత.112

115-వ. మఱియు న య్యవసరంబున ఫాలలోచనాభీలపావక కరాళజ్వాలావళీ పాత భస్మీభూతుం డై చేతోజాతుండు దెగుటఁ గనుంగొని విస్మ యాకుల చిత్త యై యతని సతి యైన రతీదేవి జల్లని యుల్లంబు పల్లటిల్ల నొల్లంబోయి మూర్ఛిల్లి యల్లన తెలివొంది శోకంపు వెల్లి మునింగి కలంగుచుఁ దొలంగరాని బలు వగల పాలై తూలుచు వదనంబును శిరంబును వదనగహ్వరంబు నందంద మోదుకొనుచు మదనుండు వొలిసిన చోటికి డాయం బోయి యిట్లని విలపింపం దొడంగె.115

133-వ. మఱియు నత్యంత దురంత సంతాప చింతాక్రాంత యై అంత కంతకు న క్కాంతాతిలకంబు మహాశోకవేగంబున.133

135-వ. తన మనంబున ని ట్లనియె.135

142-వ.అంతఁ గంతు చెలికాఁడు వసంతుం డి ట్లని విలపింప దొణంగె.142

151-వ.అనిన వసంతుండు ప్రలాపించు తదీయ ప్రకారంబుల విచారించి సముచిత ప్రకారంబున ని ట్లనియె.151

154-వ.ఇట్లు పలికిన గగనవాణి పలుకులును వసంతు పలుకులును నాలించి రతీదేవి యి ట్లనియె,154

157-వ.అని బహుప్రకారంబుల రతియును వసంతుండును దమలో నుచి తాలాపంబులు పలుకుచున్న సమయంబున.157

160-వ.అని మఱియు ననేక విధంబుల నూరడించి వసంతుని పలుకు లగుం గాక యని నత్యంత విహ్వల చిత్తంబున.160

165-వ.అంత నొక్కనాఁడు పరమేశ్వరుండు కైలాసంబున సుఖంబుండి గౌరీ దేవిం దలంచి ప్రేమచేసి యుండు టెఱింగి నిజాంతర్గతంబున.శంకరుఁడు వెలఁది యై శీతాచలంబునకు వచ్చుట165

167-వ.ఇట్లు తలంచి.167

169-వ.అని విచారించి.169

171-వ.మఱియను.171

173-వ.ఇట్లు మాయా వేషధారి యై హిమవంతుఁ బట్టణంబున కరుగు దెంచి యందు.173

176-వ.అని విచారించి.176

178-వ.అట్లు గాంచి.178

181-వ.అని మఱియు ని ట్లనియె.181

185-వ.అనవుడు న క్కపట గామిని యి ట్లనియె.185

187-వ.అని మఱియు నరుగుదెంచు సమయంబున.187

189-వ.అరుగుదెంచి తదీయ హర్మ్యస్థానంబునకుం జని పార్వతీదేవిం గనుంగొని నిలిచి యున్న యనంతరంబ.నగజకు నెఱుకఁ దెలుపుట189

191-వ.అని పలికి హిరణ్య మణి మరకత వజ్ర వైడూర్య ఖచితంబు నగు విలసి తాసనంబునం గూర్చుండి “దేవేంద్ర కమలసంభవ నారాయణ ప్రముఖు లైన దేవతలు నెఱుంగరు భవదీయ చిత్తంబున నేది యేనియుం దలంపు చెప్పెద నదియునుం గాక విను” మని యి ట్లనియె.191

193-వ.అని మఱియు సముచితాలాపంబులు పలుకఁ పరమయోగీంద్రు ప్రోడం గనుంగొని “యొక తలంపు దలంచెదఁ జెప్పు” మని కనకమయ పాత్రంబున ముక్తాఫలంబు లమరించి వానిం జూచి భావంబున ని ట్లని తలంచె.193

195-వ.ఇట్లు నియమింపఁ దలచిన.195

199-వ.అదియునం గాక.200-క.నా కేమి మెచ్చు వెట్టెదునీకున్ సిద్ధించు మేలు నిర్ణయమై నావాకునకఁ దోఁచుచున్నదివీఁకను నెఱిఁగింతు నీకు విమలేందుముఖీ!”199

???????200

201-వ.అనిన విని పార్వతీదేవి యి ట్లనియె.201

203-వ. అనవుడు న క్కపట వెలఁది యి ట్లనియె.203

206-వ. అనవుడు నా ప్రోడ యి ట్లనియె.206

208-వ. అని మఱియును.208

210-వ. ఇందేల యున్నదానవు వనవాస ప్రయాణంబు చేసి పరమేశ్వరు నేలుకొమ్ము నీకుం గానరాఁడు పరమేశ్వరుండు వీఁడే నినుఁ జూచి పోవుచున్నాఁడు నిశ్చయం” బని చెప్పి వీడ్కొని తన పూర్వ ప్రకారంబుఁ దాల్చి కైలాసంబునకుం జనియె నంత న చ్చెలియు నొక్కనాఁడు తన మనంబున ఖండేందుభూషణుం దలఁచి కామమోహావేశంబున ని ట్లని తలపోయం దొడంగె.210

214-వ. అని నిశ్చయంబు చేసి.214

217-వ. అట్లయినను.217

224-వ. ఇట్లు పలుకు వల్లభుఁ జూచి య గ్గిరీంద్రవల్లభ యగు మేనకాదేవి గౌరీదేవి కి ట్లనియె.224

230-వ. అనవుఁడు కుమారీతిలకంబు తల్లి కి ట్లనియె.230

236-వ. అనుచున్న గౌరీదేవి పలుకులు విని గిరీంద్రశేఖరుండు మేనకా దేవియుం దానును సంతసిల్లి “ దేవి యింక మాఱుమాటలు పలుక వెఱతుము భవదీయ మనోరథంబు లెల్ల నమోఘంబు లై ఫలించుఁ గాక” యని కీర్తించి దీవించి వనవాస ప్రయాణంబునకుఁ దల్లిదండ్రు లనుమతించిన.236

పార్వతి తపముసేయ వనమునకు నేగుట

238-వ. ఇట్లు వివిధ విలసిత విచిత్ర తపో వేషధారి యై తన సఖీజనంబులు దానును తలిదండ్రుల మనంబులు సంతసిల్ల వీడ్కొని వనవాస ప్రయాణం బై పోయి; కతిపయి దూరంబున నకాల పల్లవ ఫల భరిత శాఖాలోక విరాజిత మందార మాతలుంగ చందన పున్నాగ తిలక కేసర కదళీ జంబీర కదంబ నింబ తమాల రసాల హింతాళ ప్రముఖ నానా భూజాత సంఘాత విలసితంబును; నిర్మల సరోవర జనిత ఫుల్ల సల్లలిత కమల ప్రసూన బంధుర గంధవాహ ధూత బలపరాగ ధూళి పటల దశ ది శాలంకృతంబును; ననంత లతా సిత సంఫుల్ల పరిమళ మోద మారుత సమ్మిళిత దూరదేశంబును; మరాళ శారికా కీర మధుకర కోకి లాది నానా విహంగ మృదు మధుర వచన ప్రమోదితంబును నై సకల తపోవన రాజ్యలక్ష్మీ శోభిత వైభవం బనం బొల్చు నొక్క వనంబుఁ గాంచి సంతసించి దరియం జొచ్చి సంభ్రమంబున.238

242-వ. అని మఱియు ననేక ప్రకారంబుల నవ్వనలక్మిఁ గీర్తించి చెలుల నందఱి నాలోకించి వారి వారిం దగులాగున వర్తింప నియోగించి స్థలశోధనంబు లాచరించి సర్వాంగ విభూతి స్నాత యై చెలువు మిగుల తపంబు సేయం దొణంగె నిరుపమ నిర్మలత్వంబున.242

248-వ. అంతఁ దదీయ దివ్య తపో మహత్వంబు లన్నియు నవలంభించి ఆవరణ ఘోరం బై.248

255-వ. అంత న య్యవసరంబున.255

257-వ. అని యి వ్వింధంబున.257

261-వ. అనిన న మ్మాయావటునకు నబల చెలు లి ట్లనిరి.261

263-వ. అనవుడు న క్కపట తాపసుం డి ట్లనియె.263

266-వ. అదియునుం గాక.267-సీ.పొలుచు మైఁ దీగెతోఁ బొల్చు టింతియ కాకయీ వన్నెగల రేఖ యెందుఁ గలదు266

269-వ. అని పలికి గౌరీదేవి నుపలక్షించి యల్లనల్లన యి ట్లనియె.269

279-వ. అని మఱియు ని ట్లనియె.274

286-వ. విని య మ్మహాదేవి యి ట్లనియె.286

292-వ. ఆ సమయంబున.292

297-వ. మఱియును.297

299-వ. ఇ వ్విధంబున.299

308-వ. అనిన విని య ప్పరమేశ్వరుండు చెలుల విన్నపం బవధరించి శైలకన్యకా తిలకంబు నవలోకించి యి ట్లనియె.308

311-వ. అని మఱియు తగిన లాగున న మ్మహాదేవిని మన్నించి రజత ధరణీధరంబునకు నీశ్వరుండు వేంచేసె ననంతరంబ య క్కాంతా తిలకం బగు గౌరీదేవియుఁ దన్ను మహేశ్వరుండు మన్నించిన మన్ననలకు నత్యంత ప్రమోదంబు నొంది తన సఖీజనంబులుం దానును దపోవనవాసంబు చాలించి తుహినాచల శిఖరంబుఁ బ్రయాణంబు చేసె నని చెప్పి.311

ఆశ్వాసాంతము

315-గ. ఇతి శ్రీ మన్మహా మహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్య శ్రీపాద పద్మారాధక కేసనామాత్య పుత్ర పోతయ నామధేయ ప్రణీతం బైన శ్రీ వీరభద్రవిజయం బను మహా పురాణ కథ యందుఁ దారకాసుర సంగ్రామంబును; దేవతల పరాజయంబును; దేవేంద్ర బ్రహ్మ సంవాదంబును; అమరుల యమరావతీ ప్రవేశంబును; మరుండు సుర నగరంబునకుఁ బ్రయాణంబు సేయుటయు; మన్మథ పురందర సంవాదంబును; మదన రతీ సంవాదంబును; జిత్తజుండు పరమేశ్వరునిపై దండెత్తి పోవుటయుఁ గామ దహనంబును రతీ విలాపంబును; గపటదైవజ్ఞ వృత్తాంతంబును గౌరీదేవి తపంబు సేయిచుండ శివుండు బ్రహ్మచారి వేషంబున వచ్చుటయుఁ బార్వతీదేవి తపఁ ప్రయాసంబునకు నీశ్వరుండు మెచ్చి ప్రత్యక్షం బగుటయు నన్న ద్వితీయాశ్వాసము.315

తృతీయాశ్వాసము

హిమవంతుఁడు పార్వతిఁ జూచి పలుకుట

2-వ. పరమజ్ఞానభావుం డగు వాయుదేవుం డమ్మహామునుల కిట్లనియె; నవ్విధంబునఁ దనకు బరమేశ్వరుండు ప్రత్యక్షం భై యాదరించిన నోషధిప్రస్థానపురంబున కరుగుదెంచి సుందరీజనంబులుం దానును వినయవినత లై నిలిచినఁ బార్వతీదేవిని గనుంగొని ధరాధరేంద్రుండు నిజసుందరీ సహితుం డై సవినయంబున గౌగిలించుకొని దీవించి యమహాదేవిచిహ్నంబు లవలోకించి యిట్లనియె.

5-వ. అని పలుమాఱుఁ గుమారిని గీర్తించుచు దేవీ నీకు పరమేశ్వరుండు ప్రత్యక్ష మైన తెఱంగు తేటపడ వినం గుతూహలం బై యున్నది; వినిపింపు మని యడిగిన దుహినాచలేంద్రునకుఁ బార్వతీదేవిచెలు లగు జయవిజయ లిట్లనిరి.

పార్వతి చెలులు హిమవంతునకు జరిగిన వృత్తాంతంబు చెప్పుట

7-వ. ఇవ్విధంబున నశ్రాంతంబును నత్యంతఘోరంబును నగు తపంబు సేయుచుండ, నొక్కనాఁడు గిరీంద్రా! నీ కేమి చెప్ప నప్పరమేశ్వరుండు లీలావినోదంబున బాలుం డై వటువేషంబు దాల్చికొని, యేము చరించుచున్న వనంబునకుఁ జనుదెంచి, మమ్ము డగ్గరి “యీ బాల యెవ్వరిబాల?” యని యడిగిన; నేమును సముచితభాషణంబుల “మునీంద్రా! యీ కన్నె హిమనగేంద్రుని కన్నియ” యని పలికిన నతండును మాతో మఱియు ని ట్లనియె.

10-వ. నగేంద్రా! యా వటుకకుమారుఁ డైన శివుండు దాని కి ట్లనియె.

12-వ. అని మఱియు నతండు తన నిజ గుణంబులు చెప్పుటయును బార్వతీదేవికి నింద్యంబు లై తోఁచిన నక్కపటతాపసిం జూచి “వీని వనంబు వెడలఁ ద్రోయుం” డని పంచిన నేమునుం గదసి పెనంగెడు సమయంబున; నంతర్హితుం డై ప్రసన్నత్వంబు నొంది యీశ్వరుండు నిజదివ్యాకారశోభితుం డై నిలిచి తరుణియుం దానును కైలాసంబునకుం బోవ గమకించిన భవదీయ భక్తివశంబున మావిన్నపం బవధరించినవాఁ డై గౌరీదేవి నుపలాలించి నిజమందిరంబునకుం దానే చనియె మేమును జనుదెంచితిమి కతిపయ దివసంబుల లోపల మన యింటికి నీ కుమారీతిలకంబు నడుగ దగువారలం బుత్తేరంగలవాఁ” డని యేర్పడఁ జెప్పిన.

19-వ. అంత నక్కడ మహేశ్వరుండు “మునీంద్రులారా! దేవకార్యంబుఁ దీర్ప నెల్లరు నిచ్చోటికి విచ్చేయుదురు గాక.”

21-వ.ఇట్లు స్తుతియింపఁ దొడంగిరి.

26-వ.అని విన్నవించిన మునిజనంబులం గనుంగొని మహేశ్వరుం డతులిత కరుణాపూరిత మానసుం డై యిట్లనియె.

28-వ.అని పలికి యన్యపురుషావలోకనంబు సేయక వసిష్ఠపాదావలోకనంబు సేయుచున్న పతివ్రతాశిరోమణి యగు నరుంధతిం జూచి శివుం డిట్లనియె.

30-వ.అని యానతిచ్చిన మహామునులు నరుంధతీ సమేతులై పరమేశ్వరునకు పాష్టాంగదండప్రణామంబు లాచరించి వీడ్కొని పరమానందంబున నత్యంత శుభసూచకంబులు పొడగాంచుచుం దుహినశిఖరంబునకుఁ బ్రయాణంబు చేసి పోవుచున్న నతిదూరంబున.హిమవద్గిరి వర్ణనము

32-వ. మఱియును.

34-వ. తమలో ని ట్లని తలంచిరి.

36-వ. అని మఱిమఱి కీర్తించు నమ్మహామునులు ప్రాలేయాచలంబు డాయంబోయి మహీధ్రవల్లభు మందిరంబు వీక్షించి ఖేచరత మాని భూచరులై యతని పెద్దమొగసాల నిలచి యున్న సమయంబున.

38-వ. అత్యంత సంభ్రమంబునఁ దన యనుంగు మొగపాలకుఁ బఱతెంచి వారలం గని, వినయంబునఁ బ్రణామంబులు చేసి, యమ్మహత్ములఁ దన యంతఃపురంబునకుం గొనిపోయి ప్రియ వూర్వకంబుగా నర్ఘ్య పాద్యాది విధులం బూజించి కనకరత్న పీఠంబుల నుండ నియోగించి నిజకరంబులు మొగిడ్చి మంద మధురాలాపంబుల ని ట్లనియె.

261-వ. మహాత్మా నిన్ను వేఱువేఱ నెన్న నేల సకలభూతాంతర్యామి వని వినంబడుచుండు వేదంబులవలన నీ మహిమ కొలఁది వినుతి సేయ వశమే పరమేశ్వరా! పరమభట్టారకా! సచ్చిదానందస్వరూపా!” యని బహుప్రకారంబుల వర్ణించుచున్న కమలసంభవప్రముఖ లైన దేవగణంబులం జరియింప నియోగించి నాటఁగోలె సమస్త జగత్పరిపాలనంబు సేయుచున్నవాఁడ” నని మఱియు నమ్మహాదేవుం డిట్లనియె.

264-వ. అని మహాదేవుండు దేవికిం జెప్ప నని చెప్పి తదనంతరంబ.

ఆశ్వాసాంతము

268-గ. ఇది శ్రీ మన్మహేశ్వర యివటూఠి సోమనారాథ్యా దివ్య శ్రీపాదపద్మారాధక కేసనామాత్యపుత్త్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవిరభద్రవిజయం బను మహాపురాణ కథ యందు మహాదేవు పంపున మునులు వోయి; ముద్రారోపణంబు చేసి వచ్చుటయు; హరి విరించ్యాది బృందారక సేవితుం డై యీశ్వరుండు వివాహంబునకుం జనుటయు; హిమ నగేంద్రుని మహోత్సవంబున భూమిక్రుంగిన శంభుపంపునం గుంభజుం డరిగిన నత్యంత సమతలం బై యుండుటయును; గౌరీవివాహంబును; భవానీశంకర సంవాదంబును; దేవ దాన వోద్యోగంబును; కాలకూట సంభవంబును; దానిఁ బరమేశ్వరుండు పరహితార్థం బై యుపసంహరించి నీలకంఠుండ నైతినని యానతిచ్చుటయు; నన్నది తృతీయాశ్వాసము.

ఆశ్వాసాంతము

268-గ. ఇది శ్రీ మన్మహేశ్వర యివటూఠి సోమనారాథ్యా దివ్య శ్రీపాదపద్మారాధక కేసనామాత్యపుత్త్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవిరభద్రవిజయం బను మహాపురాణ కథ యందు మహాదేవు పంపున మునులు వోయి; ముద్రారోపణంబు చేసి వచ్చుటయు; హరి విరించ్యాది బృందారక సేవితుం డై యీశ్వరుండు వివాహంబునకుం జనుటయు; హిమ నగేంద్రుని మహోత్సవంబున భూమిక్రుంగిన శంభుపంపునం గుంభజుం డరిగిన నత్యంత సమతలం బై యుండుటయును; గౌరీవివాహంబును; భవానీశంకర సంవాదంబును; దేవ దాన వోద్యోగంబును; కాలకూట సంభవంబును; దానిఁ బరమేశ్వరుండు పరహితార్థం బై యుపసంహరించి నీలకంఠుండ నైతినని యానతిచ్చుటయు; నన్నది తృతీయాశ్వాసము.

చతుర్థాశ్వాసము

వీరభద్రవిజయ ప్రకారంబు.

2-వ. పరమజ్ఞానభావుం డగు వాయుదేవుం డమ్మహామునులతో “మీ రడిగిన యర్థంబు లెల్ల సవిస్తారంబుగా నెఱింగించితి; మునీంద్రులారా! వీరభద్రేశ్వరుని విజయప్రకారంబు నిజంబు వర్ణింప బ్రహ్మదేవునకు నలవిగా దైనను నాకుం దోచిన విధంబున విన్నవించెద వినుం” డని యిట్లనియె.2

6-వ.అంత.6

8-వ. ఇట్లు సకల దేవతలును జనుదెంచిన వారల నుచితోపచారంబుల సంభావించి వూజించి డక్షుండు మఖంబుం జేయందొడంగె నయ్యవసరంబున.8

14-వ.అనిన విని యతండు తదీయాలాపంబులు కర్మవశంబునఁ దన మనంబు చొరక శూలంబులై తాఁకిన నదరిపడి సదస్యుల నాలోకించి “ మహాత్ములారా! భవదాగమన కారణంబునఁ గృతార్థుండ నైతి;” నని పలికి పూజించి పిలువఁ దొడంగి నాఁ డితఁడు శంకరదేవుఁడు లేని జన్నము నెయ్యడలఁ గలదె వేదములారా!” యని మఱియును.14

17-వ.అని పుణ్యచక్షుం డగు దధీచి పాపచక్షుం డగు దక్షున కిట్లనియె.17

దధీచి దక్షుని మందలించుట.

21-వ.అనవుడు దక్షుం డతులిత కోపాతురుం డై యిట్లనియె.21

24-వ.అనవుడు దధీచి దక్షున కిట్లనియె.24

29-వ.అదియునుం గాక.29

42-వ.పుణ్యమానసుం డగుదధీచి కోపమానసుం డై నయనంబుల వాని వీక్షీంచి యమ్మఖంబున నతని దగ్ధంబుగా శపింప గమకించి నాకున్ వేగిరపడ నేల యిక్కార్యంబునకుం గైలాసవాసుం డున్నవాఁడు గదా యని దేవతల మొగం బై యిట్లనియె.42

దక్షుని యజ్ఞ వృత్తాంతము దధీచి శివునకుఁ దెల్పుట.

51-వ.అని విన్నవించిన నతని పలుకులు విని పరమేశ్వరుండు కోపీంచి శివునిహుంకారంబున వీరభద్రుండు పుట్టుట.

53-వ.ఇట్లు పుట్టి.

55-వ.మఱియుఁ బ్రచండమార్తాండమండలమండితోద్దండ తేజో విరాజిత దుర్నీక్షణకుండలాభరణుండును, సహస్రరవి మండల తేజోవిలాస ప్రకాశిత దివ్వదేహుండును, బాలసూర్యప్రభా పటల చటుల పద్మరాగ మణిమకుటవిటంక విలంబమాన కర్కాటకశిరోవేష్టన కాలకూట త్రినేత్రసంయుక్తంబై రౌద్రరసంబు వెదచల్లు హస్తసహస్రంబును, గఠోరకుఠార గదాదండ భిండివాల కరవాల ముసల ముద్గర తోమర భల్లాంగ ప్రాస పట్టిన కోదండ శర చక్ర ముష్టిసంబగళ గదా త్రిశూల పరశు లవనిలాంగోష్ఠ్యసి క్షురి కౌతళ వంకుళీ యమదండ నారసజముదాళ శక్తిప్రముఖ దివ్య దివ్యాయుధసమూహ శిఖా సమాశ్రయంబై బ్రహ్మాండంబు వ్రక్కలించునట్టి దీర్ఘబాహుదండ సహస్రంబును, నారాయణేంద్రాది నిఖిలదేవతాదుల మణిఘటిత మకుటారణ్యస్ధలీ రంగవల్లీ రణరంగ తాండవక్రియా నిర్ఘాత భయదండంబు లగు చరణారవింద రాజితుండును భుజంగ రుద్రాక్షమాలికా విభూతి త్రిపుండ్ర శార్దూల చర్మాంబర సామజచర్మాంబర రథారూఢుండును, వజ్ర వైడూర్యేంద్ర నీల గోమేధిక పుష్యరాగ మరకత పద్మరాగాది మౌక్తికహార కేయూర కంకణాంగుళీయక మంజీరాంకిత దివ్యదేహుండును, ప్రళయకాల సమయపయోధరగర్జిత నిర్ఘాతజనిత నినదసన్నిభ సకల భువసభయంకర సింహనాదుండును, సకల బ్రహ్మాండభాండసముదయ భయద విపరీతాట్టహాసుండును, విపుల విలయకాలానల మారుత శైలశిఖర ప్రపాత నాసికాపుటకుటీ నిశ్శ్వాసుండును, మదగజగండభేరుండ సింహశరభశార్దూలాది సంగర విద్యావిశారదుండును, నిఖిల లేకైకోత్పత్తిస్ధితిలయప్రకారుండును, నిర్జరారాతిసంఘాత నిరస్త గహనక్రియాకలాపుండును, అఖిల భూత సమాశ్రయుండును నైన ధూమకేతుండును, త్త్రెలోక్య దానవ విదారుండును, అనేక సహస్రకోటి మధ్యందినమార్తాండపటల ప్రభోజ్జ్వలుండును, శైవదూషకజన వక్త్ర పదతాడన నిర్ఘాత సంఘటితుండును, అగణిత గుణగణాలంకృతుండును, అసహాయ శూరుండును, అతులిత దుర్వారగర్వదర్పోద్ధతుండును నై యొప్పుచున్న వీరభద్రేశ్వరుండు.

పార్వతికోపంబున భద్రేశ్వరి యను కన్య పుట్టుట.

57-వ.అంతఁ దత్సమయంబున వీరభద్రేశ్వరుండు భద్రేశ్వరిం గూడూకొని పరమేశ్వరుని పాదపంకజంబులకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి కరసహస్రంబులు మొగిడ్చి “దేవా! మీరు నన్నుం బుట్టింపఁ గారణం బేమియో యవధరింపుఁ” డని యిట్లనియె.

60-వ.అనిన విని యల్లన నవ్వు మొగంబున నద్దేవున కిట్లనియె.

68-వ.అనిన విని మెచ్చి పార్వతీ దేవి యవ్వీర శేఖరున కిట్లనియె.

71-వ.అట్టి పనిఁ బూని దక్షయాగంబుపైఁ బోవ గమకించి వీరభద్రుం డతులిత రౌద్రాకారుండై యిట్లని విచారింపందొణంగె.

73-వ.అని సకలలోకంబులుం గొనియాడ వీరయాగంబు సేయవలయు నని విచారించి.

76-వ.ఇట్లు పుట్టిన.

78-వ.అంతఁ దదీయ గణనికాయంబులు తన్నుఁ బరివేష్టించి దండప్రణామంబు లాచరించి సంభ్రమంబున.

ప్రమథగణములతో వీరభద్రుఁడు దండెత్తుట.

81-వ.ఇట్లు వీరరణ సైన్యాధిష్టితుండును, గోరాజ గమనుండును, భద్రేశ్వరీ సహితుండును, నారాచ గదా దండ భిండివాల త్రిశూల దివ్వబాణ నిశితాయుధ పరివృత బాహుదండుండును, రణదుందుభీ నిస్సహణ శంఖ కాహళ ఘంటి కారావ భీకరుండును, నతులిత కోపాటోప సంరంభుండును, సమర సన్నాహుండును, వివిధ విలసిత వీరలక్ష్మీ విలాసుండును, వృషభకేతనాలంకారుండును నై పురంబులు సాధింప వసుంధరారూఢుండును గౌరీసమేతుండును నై యరుదెంచు పురారాతి చందంబున నతి సుందరుండై వీరభద్రేశ్వరుం డరుగు దెంచుచున్న సమయంబున.

84-వ.అంత నవ్వీరభద్రుండు తుహినాచలశిఖరంబు డాయంబోయి కతిపయ దూరంబున దక్షాధ్వరకలకలంబు విని గణంబుల కిట్లనియె.

86-వ.అని హెచ్చరించి మైవెంచి వీరజనచూడామణియగు వీరభద్రేశ్వరుండు.

88-వ.ఇట్లు కాంచి తదీయ మందిరంబు గణంబులుం దానును జుట్టుముట్టి విపుల వీరావేశ కోపాటోపోప సంరంభుఁడును గరాళ వదనుండును నై చెలంగి యార్చిన.

92-వ.ఇట్లు సింహనాదంబు చేసి విజృంభితుం డై “యిం దెవ్వరేని పాఱిపోయెదరు; వీరల మెదిలిపోనీకుం” డని రభసంబున నయ్యాగమంటపంబు చుట్టును ఖడ్గ పరశు త్రిశూలహస్తు లైన ప్రమథగణంబులఁ గాపు వెట్టి తానును వీరగణనేవితుం డై యవ్వీరభద్రుండు దక్షమఖమండపంబుఁ దరియం జొచ్చు సమయంబున; వెఱిచియు వెఱవని చందంబున దక్షుఁ డిట్లనియె.92

97-వ.అనిన నవ్వి దక్షుం డిట్లనియె.97

99-వ.అనిన విని ఋగ్యజుస్సామాధర్వంబులు మహావినయభీతచిత్తు లై లేచి తదీయమఖమంటపంబున నున్న సదస్యులం జూచి యిట్లనియె.99

101-వ.ఇట్లు వేదంబులు వివరించుటయును, వేల్పులు వినకుండుటయును, వెంగలి యైన దక్షుండు విరోధించుటయును, వీరభద్రుండు వీక్షీంచి తత్సభవారల కిట్లనియె.101

103-వ.అని పలికి.103

105-వ.ఇట్లు మహావీరావేశంబున భేరీ ఢంకార నినాదంబులు గగన మండలంబు నిండి చెలంగ వెండియు నిట్లనియె105

108-వ.మఱియుఁ; బ్రళయకాల నీలజీమూతపటలంబులంబోలి పోనీక వెనుతగిలి పలుదెసలం బాఱి విసరు వెనుగాడ్పు చందంబునఁ జరాచర జంతుసంఘంబుల మండలీభూతసముద్ధండ కోదండుం డై వైభవాడంబరం బగు బ్రహ్మాండంబుల నొండొండఁ జేర్చి చెండాడెడు ఘోరాడంబరుం డగు నఖండదండధర వైరి విధంబున దివిరాసి యరితూల యడుగుల పయింబడి యంకిలి లేక దరికొని గరలి వడిగాలి దోఁడుగాఁ గల్గు విలయకాలానలంబు కైవడిఁ గవిసి గిరిగహ్వర గహన గుహాంతర్గత శయనసుప్తంబులైన మదగంధగజ యూథంబుల ఘీంకారంబుచేత ప్రబోధింతబై వాని వెనుదవిలి కుంభస్థలమాంసంబు నఖదంష్ట్ర్రంబులం జించి చెండాడు సింగంబు పగిది మహార్ణవాంతరంగంబున మత్స్య కచ్ఛప కర్కటక తిమి తిమింగిలాది జంతుసంతానంబు లాగున పయఃపారావార మధ్యంబున నమృతాహరణార్థంబు దిరుగు మహామందరంబు తెఱంగున మహాభీకరంబుగాఁగఁ గలసి కరాళించి విలయసమయ విజృంభిత జీమూతనిర్ఘాత ప్రచండ ఘనరవ భయంకరంబుగా శంఖంబుఁ బూరించి విడంబించి యెక్కడఁ జూచినఁ దానయై హరి పురందర విరించాదులు దిగులుకొని బెదరి బెదరి పఱవఁ బోనీక యదరంటం దాఁకి గుడుసువడి వీఁకమై వెఱచఱచి పఱచునట్లుగా దేవగణంబుల మూకల కులికి యగ్గణరాజకంఠీరవుం డగ్గలిక మెఱయ బలువిడిఁ గడువడి కెరలి పిడుగులం బోలిన బాణాజాలంబులు పఱపుచు, శూలంబులఁ బొడుచుచు, నేలపాలు చేయుచుఁ, గఠారంబులఁ బొడుచుచుఁ, గుఠారంబుల ఖండించుచుఁ, బరశువుల నఱకుచు, నత్తళంబుల నొత్తుఛుఁ, జక్రంబులఁ ద్రెంచుచు, భిండివాలంబుల ఖండించుచుఁ, జంచువుల విజృంభించుచు, నఖంబులఁ జీరచు, పాదంబులఁ జవురుచు, పిడికళ్ల రువ్వుచు, నరచేతులం బాదుచుఁ, దూపులఁ బఱపుచుఁ, గవిసియుఁ దనివిఁ గొనక వెండియు; నానావిధ పదఘట్టనంబుల మహీమండలంబులఁ గప్పుచు, మార్తాండ మండలంబు తెఱంగున నతని వెయి చేతుల విడంబించి యఖండ వివిధ విలసిత విశిఖవ్రాతంబుల నందఱకు నన్ని రూపులై తోఁచి గొడుగులు విఱుచుచుఁ, జామరంబులఁ బొడిసేయుచు, శిరంబులు గూల్చుచు, శిఖలు వెఱుఁకుచు, వదనంబులు ద్రుంచుచు, సూరువులుఁ బదంబులు వ్రచ్చుచు, గళంబులు గోయుచు, భుజంబులు విడిపించుచు, నాలుకలు గోయుచు, ముక్కులు జిదుముచు, చెక్కులు గమకించుచు, ప్రేఁగులు ద్రెంచుచు, కన్నులు బెఱుకుచు, చెవులు ద్రెంచుచుఁ, గీరీటంబులు పదతాడనంబున రాల్చుచు, కండలు చెండుచు, రక్తంబులు గ్రోలుచు, నెముకలు రాల్చుచుఁ, బడద్రోచి పండ్లు పీఁకుచుఁ, గొందఱ హోమగుండంబుల నిండను వ్రేల్చుచు, నుదరంబులు ఖండించుచు యిట్లు మఱియుం; గలంచుచు, గుదించుచుఁ, గోలాహలంబు సేయుచు, యేపుమాపియుఁ జమరియుఁ జక్కడిచియు నెఱి చఱచియు నేలపాలొనర్చియు ననంత సమర కేళీవిహారం బొనరింప దేవసంఘంబులు సైరింపంజాలక నలంగియుఁ, దొలంగియు, నొచ్చియుఁ, జచ్చియుఁ, జర్జరితులై మూర్ఛిల్లియుఁ జెల్లాచెదరై పాఱియు, నొండొరువులఁ జొచ్చియు నున్నం గనుంగొని వీరభద్రేశ్వరుండు.108

110-వ.అని ముదలకించి యవ్వీరభద్రుండు రౌద్రోద్రేకంబునఁ బ్రళయకాలరుద్రుండై.110

వీరభద్రుఁ డింద్రుఁడు మున్నగువారిని శిక్షించుట.

125-వ.తదనంతరంబ.125

127-వ.మఱియు; సముచితాలాపంబులు పలుకు యుగాంతకాల రుద్రుండునుం బోలె నట్టహాసంబు సేయుచు; మహితమందర మహీధ్రమథిత మహార్ణవ కల్లోలచయంబునుం బోలె శోషించుచు; కంఠీరవంబునుంబోలె గర్జించుచు; మదాంధసిందురxబునుం బోలె మ్రోయుచు; వర్షాకాలమేఘంబునుం బోలె శరవృష్టి గురియుచు; రాహుమండలంబునుం బోలె నొడియుచు; గంతులు ద్రొక్కుచుఁ దాండవంబాడు పురారాతియునుం బోలె వింతగతుల రణవిహారంబు సలుపుచుఁ; బెనుగాలియుం బోలెఁ దూలుచు; బడబాగ్నియునుం బోలె నార్చుచు; నంధకారంబునుం బోలెఁ గప్పుచు; నేలయు నింగియు నొక్కటియై పొడువుపొడువు పోనీకుఁ బోనీకు చంపు చంపు మని యెఱింగించుచు; దశశతకోటిసహస్రలక్షానేకకోటిసంఖ్యలై దేజరిల్లుచు; యూపంబులఁ బెఱుకుచు; నాచార్యుల నడచుచు; హోతలప్రాణంబులు హోమంబులకు నాహుతులు గావించుచు; పశువుల ననువులు బాపుచు; గంధర్వుల కంధరంబులు ద్రెంచుచు; సిద్ధసాధ్యచయంబుల ధట్టించుచు; సూర్యులం దూలించుచు; తాపసుల విచారించుచు; మునిజనులం దండకమండల యజ్ఞోపవీతములు తుత్తుమురులు సేయుచు; బ్రహ్మ శిరంబుఁ గుదియించుచు; సురాసురజాతంబుల నెరియించుచు; నిప్పులు లొలుకు చూపుల నందఱం గప్పి తలలు కోసి కుప్పలు పెట్టుచుఁ; బ్రేవులు పోగులువైచుచు; కండలు చెండి కొండలుగా వైచుచు; పీనుఁగుపెంటల నడుమ నెత్తురుటేఱులు గావించుచు; దేవభటుల మాంసంబు లిచ్చి భద్రకాళి మెప్పించుచు; భూతప్రేతపిశాచగణంబులం దనుపుచు; వీరజయలక్షీ విలాసుం డై ప్రజ్వరిల్లుచు వీరభద్రేశ్వరుండు.127

129-వ.మఱియు వీరావేశంబున.129

134-వ.ఇట్లు రణంబు సేయుచు నవ్వీరజనచూడామణి యగు వీరభద్రుండు దక్షు నుపలక్షించి.

దక్షుని శిరంబుఁ ద్రుంచుట.134

136-వ.అంత భద్రకాళియు మహాకాళియుం బోలెఁ గరాళించి దారుణాభీల శూలహస్త యై రణంబున మాఱులేక తిరుగుచు వీరభద్రుం డిచ్చిన దక్షుని మస్తకంబు గని మహాభయంబున.136

138-వ.తత్సమయంబున నయ్యాగపురుషుండు మాయామృగాకారుం డై తిరిగి పోవుటం గనుంగొని “పోకు పోకు నిలు నిలు మింక నెటు బోయెదు మత్కోపబడబానలంబు బాఱిఁ బడితివి గాక” యని విల్లు మోపెట్టి బెట్టిదం బగు నయ్యర్థచంద్రబాణంబుఁ దొడిగి కడువడి నతని శిరంబుఁ బుడమిం బడనేసి కూల్చి బిట్టార్చి చిక్కన మూకలపైఁ గవియుచుండ భయంపడిన దేవజనంబు లెల్లను నార్తారావంబుల మహాదైన్యంబున.138

వీరభద్రుఁడు విష్ణువుతో యుద్ధము చేయుట.

140-వ.ఇవ్విధంబున.140

142-వ.తత్సమయంబున.142

146-వ.దేవా! యీ దివ్యరథారూఢుండ వై సమరకేళీవిహారంబు సలుపుదువు గాక” యని విన్నవించిన “నగుం గాక” యని యుదయ ధరణీధర శిఖరంబు ప్రవేశించు దినరాజు చందంబునఁ దన మనోరథంబునకు హితమైన దివ్యరథం బెక్కి యుక్కుమిగిలి గుణయూథంబు లిరుగెలంకుల యందును నందంద వీరభేరీ మృదంగ శంఖ కాహళ నిస్సాణాది వాద్యంబులు చెలంగ నిలింపశ్రేష్ఠుం డగు పరమేష్ఠి దనకు సారథియై చరియింప నకంపిత విక్రముం డై ప్రళయకాల భైరవుండునుం బోలె సింహనాదంబులు సేయుచు దేవగణంబుల మనంబులు వ్రయ్యలై పగులునట్లుగా శంఖంబు వూరించి కుంభినీధరంబుపైఁ గవయు దంభోళిధరుని చందం బై పురందర గోవిందాదులం గదిసి వీరభద్రేశ్వరుండు.146

150-వ.అంత.150

152-వ.మఱియు నయ్యవసరంబున జగంబులఁ బెన్నుద్దులైన బలుమింటి జోదు లిద్దరు నొండొరులం గైకొనక గెలుపు తలంపులు గైకొని మదంబునఁ దమతమ లాఘవంబుల మెచ్చక మత్సరంబులు రెట్టించి బెట్టిదంబు లగు పంతంబులు పలుకుచు; నగణితగుణఘోషంబుల దిగంతరాళంబులు దిగులు కొలుపుచు గుడుసువడి యుండఁ; గోదండంబులఁ దెగటార్చుచు సుర సిద్ధ సాధ్య సంఘాతంబులకు భయంబు బుట్టించుచు; మహితమార్గంబు నిండ నభోమండలంబున మంట లెగయించుచు మర్మంబులు గాఁడిపార ననేకదివ్యబాణంబులు పఱపుచు సంహరించుచు నన్యోన్య శరీరజాలంబులు తుత్తుమురు సేయుచు నిప్పునిప్పును గరిఁగరియును ధరణిధరణియును మహార్ణవము మహార్ణ వంబును గిరీంద్రము గిరీంద్రంబును బ్రహ్మాండము బ్రహ్మాండంబునుం దాఁకి తనివి చనక పోరాడు చందంబున సములై యసమాన రణవిహారంబులు సలుపుచు; కాలసర్పంబులుం బోలె మ్రోగుచు కంఠీరవంబులుం బోలె గర్జించుచు జలధరంబులుంబోలె శరజాలంబుల భూమండలంబుఁ గప్పుచు కాలరుద్రులుంబోలె నడరుచు; ధారధరంబులుంబోలెఁ గప్పుచుఁ; దారౌటఁ దెలుపుచుఁ; బరస్పరభల్లభగ్నాంగు లై మూర్ఛిల్గుచుఁ; దెలియుచు; సింహనాదంబులు సేయుచు; బిట్టల్క నట్టహాసంబు సేయుచు; నార్చుచు; నిజపాయకంబుల నభోభాగ భూభాగంబులు వెల్లి విఱియించుచు; నజాండభరితంబు లగు హుంకారంబు లొనరించుచుఁ; దుహినదహనవరుణాంధకార గంధవాహంబు లనంగల ఘోరశరంబులు ప్రయోగించుచు; నిరువురుఁ గరలాఘవంబులఁ బరిభ్రమించుచుఁ; బుంఖానుపుంఖంబుగా వేయుచు నదల్చుచు; నతిభయంకరంబుగా సంగరంబు సేయుచుండి రయ్యవసరంబున.152

157-స.అయ్యవసరంబున.157

160-వ.మఱియు నయ్యవసరంబున నిర్వికారనిశ్చేతనుండై విరథుండై యున్న మాధవుం జూచి యవ్వీరుండు తన బాణజాలంబుల నతిని ప్రాణంబులు గొన సమకట్టి, యీశ్వరప్రియుం డని మనంబునం దలంచి, ప్రమథగణంబులచేత నచ్చక్రంబు నులిమి తెప్పించి తదనంతరంబ. వీరభద్రుం డింద్రాదులతోఁ బోరాడుట.160

163-వ.ఇట్లు తన కెదురుపడ నారాయణేంద్రాది దేవగణంబుల నాలంబున పలాయమానంబులం జేసి తనివిచనని కోపంబున నొకని నొకనికిం బది నూఱు వేయు లక్ష కోటిరూపులై విజృంభించి ప్రళయకాలాగ్ని చందంబున వలయాకారంబుఁ గొని కొఱవి ద్రిప్పిన తెఱంగున నెక్కడఁ జూచినఁ దానయై కనుపట్టి చంపుచు; నెదురులేని మదగజేంద్రంబు చందంబున నవ్వీరగణ కంఠీరవుండు ఘోరవీరతాండవాడంబరుం డై సమరకేళీవిహారంబు సలుపుచున్న సమయంబున నిలింప దేవ సంఘంబులు వీరభద్రునిచే భల్లభగ్నాంగులై శిరంబులు దెగి అర్ధచంద్ర నిశిత విఖంబులఁ గంఠంబులు దెగి పడి బెగడి జేవురు గొండల తెఱంగున నెత్తుటఁ జొత్తిల్లువారును; తమ బంధుజనంబులం బాయఁజాలక వారి కెదురుపడి చచ్చువారును; గుముర్లు కట్టి వీరభద్రు రణంబు చూచి భీతచిత్తులై ప్రాణంబులు విడుచువారును; దావానలంబునం బడి కాలు భూరి జంతుచయంబుల చాడ్పున భద్రుఫాలానలంబున భస్మీభూతు లగువారును మఱియు శివద్రోహుల మగు పాపకర్ముల కింత వలవదే యని తమలోన నెఱింగించుకొను వారును మఱియుఁ గులశైలగుహాంతరములలో డాగువారును; గాఱడవుల దూఱువారును; నేరుల మునుంగువారును; నెఱ్ఱెలు చొఱఁ బాఱువారును; బీనుఁగుల మఱువు దీసికొనువారును; రూపు చెడి దేహయష్టి తుత్తుమురులైన వారును; “వీరభద్ర వీరభద్రా శరణంబు శరణం” బనువారును; భల్లాయుధంబులచేత దేహంబులు వ్రయ్యలై పలుమాఱు నెలుంగెత్తి యేడ్చువారును; వూరి గఱచుకొని నిరాయుధులై పడువారును నైరయ్యవసరంబున కొండలరాసులు వ్రేగులప్రోవులు నెముకలతిప్పలు మాంసంబులు పీనుఁగు తలలు పెంటలు మెదడు రొంపియు నెత్తురుటేరులును నై పీనుంగులు జలచరంబుల చాడ్పునను ధవళచామరంబులు వెలినురుఁగుల చందంబునను గంధర్వ దివిజ శల్యంబుల తెట్టలు కొండల కైవడియు నై పడియున్న దేవభట్టారకు లరవిందపుఁ దూండ్లభంగియుఁ దునిసిన ధవళఛత్రంబులు పుండరీకంబుల కరణియు రాలిన కరకంకణాది భుషణజాలంబులు మరాళాది జలపక్షుల లాగునను గుప్పలుగొని పడియున్న శిరంబులు శంఖంబులును దట్టంబులు నానా ద్వీపంబులును మార్తాండమండల కిరణంబులవలనఁ దేరి చూడరాని నెత్తురుటేరులును శరంబులచేత నురంబులు పగిలి పఱచు నిలింప సంఘంబులు తరంగంబుల చందంబునను మహాభీతచిత్తులై పఱచు నార్తారవంబులు మ్రోఁతయు నై మహార్ణవంబుతో ననుకరించె నప్పుడు శరచ్చంద్రికా మయూఖ విలసితుం డైన చందురుండునుం బోలె రక్తార్ణవంబు నుబ్బించుచు వీరభద్రుం డొప్పుచుండె నయ్యవసరంబున.163

166-వ.అనిన విని మునీంద్రులు విస్మయాత్మకు లై వాయుదేవు నుపలక్షించి తమలో నిట్లనిరి.166

170-వ.అని మునీంద్రులు సముచితాలాపంబులం బల్కుచు వాయుదేవుం జూచి “మహాత్మా! మఱియును దత్సంగ్రామంబున వీరభద్రుం డెవ్విధంబునం జరియించె వినుపింపు” మని యడిగిన నతం డిట్లనియె.170

172-వ.తత్సమయంబున.172

178-వ.ఇట్లు స్తుతియింపం దొడంగిరి.178

180-ద.శ్రీనీరరూపా! శివ! ద్రోహగండా! ప్రచండప్రతాపా! సుపర్వాణసంఘా! తమోభానుబింబప్రదీపా! మహాకోప రూపాదివీరాంకవీరా! పురారాతి సంహార ఘోరావతారా! శివాచారమందార! బృందారకాధీశగర్వాపహారా! దయాకార! నాగేంద్రహారా! సనందాదియోగీంద్ర చేతోవిహారా! జనాధార! నీ దివ్య తత్త్వంబు భావింపఁగా లేక గర్వాంధకారాంధు లేమైతిమో నీదు రూపంబు రూపింప నజ్ఞాన బంధంబులం జిక్కి వేద ప్రకారంబులన్ మించి యిచ్చోటికిం దక్షయాగంబు వీక్షింపఁగా నిన్ను మారాక యెల్లం గడుం దప్పులై యుండు సైరింపవే దేవదేవా! శివద్రోహు లై నట్టి మమ్మున్ విజృంభించి శిక్షించి తీవింక నీదైన వైరంబు చాలింపు తండ్రీ! మముం గూర్చి మే మెంతవారమ్ము నీ యానతిం గాదె యీ బ్రహ్మ లోకంబులం బ్రాణనిర్మాణుఁ డై యుంట; నీ యానతిన్ గాదె యీ విష్ణు లోకైకరక్షాభుజాదక్షుఁ డై యుంట; నీ యానతిం గాదె రుద్రుండు సర్వ ప్రపంచారి యై యుంట; నీ యానతిం గాదె రేయుం దినంబుల్ వెలుంగొందుచుం జంద్రసూర్యాదులున్ భవ్వు లై యుంట; నీ యానతిం గాదె దేవేంద్ర నాగేశ ముఖ్యుల్ ప్రతాపించి దిక్పాలు రై యంట; నీ యానతిం గాదె దేవౌఘముఖ్యుల్ సులోకోపకారార్థు లై యుంట; నీ యందుఁ గాదె సరోజాతజాతాండముల్ దొంతు లై యుంట; నీ యున్న చందంబు నేమెంత యూహింపఁగావచ్చు; వేదంబులు న్నీవ; వాదంబులు న్నీవ; ధైర్యంబులు న్నీవ; మర్మంబులు న్నీవ; యీ బ్రహ్మయు న్నీవ; యీ విష్ణువు న్నీవ; యీ రుద్రుఁడు న్నీవ; సర్వంబును న్నీవ సుమ్మీ; జగన్నాధ! నీ పెంపు నీకుం దలంపంగఁ జిత్రంబు మాబోఁటి వారెల్ల నిన్నున్ విచారింపఁగా నేర్తురే? నీవు కారుణ్యదృష్టిన్ బ్రసన్నుండ వై వీరు నా వారు నా దాసు లంచున్ ముదంబొప్ప మన్నించి దివ్యప్రబోధ ప్రపాదంబులన్ జేసి రక్షింపగా నీకు భారంబు గాకుండు నజ్ఞానభావంబులం బాపి సుజ్ఞానమార్గంబులం జేసి నిష్కర్ము లై నిత్య సమ్మోదు లై యేకచిత్తంబునం బొంది నిర్వాణు లై నిష్కళంకంబులన్ బొంది మిన్నంది మీ యందు భావంబు గీలించి; నీ దివ్య రూపంబు దా నెట్టిదౌఁ గాక యంచుం దలం పొంది భావించు వా రెల్ల దృగ్గోచరం బైన నిన్నేర్పడం గానఁగా లేక విభ్రాంతు లై చిక్కువడ్డార దెందేనిమిత్తంబునం జేసి నీ చందము న్నీ విలాసంబులు న్నీదు రూపంబునుం జూచియు; న్నీవు దండించు పుణ్యంబులు న్బొందఁ గల్గెన్; మహాధన్యుల మ్మైతీ మో దేవ! దేవాదిదేవా! మహాదేవ! నీ లెంక లైనట్టి నీ దాసు లైనట్టి మమ్ముం దయాళుండ వై ప్రీతి రక్షింపవే; దేవ! వీరెవ్వరుం గానఁగా లేరు నేరంబు సైరింపవేచ దేవ! మన్నింపవే దేవ! శ్రీవిరభద్రా! శరణ్యంబు రుద్రా! నమస్తే! నమస్తే! నమస్తే! నమః.180

187-వ.అని మఱియు ననేక ప్రకారంబుల దామోదర విరించీంద్రాది సుర గణంబులు వినుతింప ననుకంపాయత్త మానసుండై వీరావేశంబుఁ జాలించి, గోవింద పురందర దేవగణసమూహంబులకు శృంఖలాబంధ మోచనంబులు చేయించి యప్పరమేశ్వరుం డున్నయెడకుఁ జనుదెంచి పాష్టాంగదండ ప్రణామంబు లాచరించి తన కడిమి మెఱసి దక్షాధ్వరంబు చుట్టుముట్టుకొని పట్టితెచ్చిన దేవతలను దదీయాంగకంబులును నమ్మహాదేవు సన్నిధిం బెట్టి వేర్వేఱ నెఱింగించువాఁడై యిట్లనియె. పరమేశ్వరునితో వీరేశ్వరుండు ధ్వంసవృత్తాంత మంతయుఁ దెల్పుట.187

189-వ.అని విన్నవించి ముకుళితహస్తుం డై వీరభద్రేశ్వరుండు నిలిచియున్న సమయంబున.189

192-వ.అయ్యవసరంబున సరోజసంభవుండు పరమేశ్వరునకుపాష్టాంగదండ ప్రణామంబు లాచరించి కరమలంబులు నిటలంబున ఘటియించి విశేష తాత్పర్య చిత్తుం డై “సర్వెశ్వరా! యొక్క విన్నపం బవధరింపు” మని యిట్లనియె.192

198-వ.అని విన్నవించిన నప్పరమేశ్వరుండు.198

201-వ.అని సకలభువనప్రతీష్ఠుం డగు పరమేశ్వరుండు కరుణాకటాక్షుం డై.

శివుండు బ్రహ్మమొదలగువారి ననుగ్రహించుట.201

205-వ.ఇవ్విధంబున.205

213-వ.అని మఱియు శరణంబు వేఁడితి దక్షునిం గనుంగొని రజతగిరి మందిరుం డిట్లనియె.213

216-వ.మఱియు తదీయావసరంబున నారాయణ బ్రహ్మేంద్రాదిదేవ గణంబులు దండప్రణామంబు లాచరించి కరకమలంబులు ఫాలంబునఁ జేర్చి యిట్లని స్తుతియింపఁ దొడంగిరి.216

219-వ.అని మఱియు ననేకవిధంబుల నయ్యాదిదంపతుల స్తుతియింప నంత నప్పరమేశ్వరుండును వీరభద్రునిం జూచి కరుణావిశేషమానసుండై “భద్రకాళియును నీవు నిందు ర”మ్మని చేరం బిలిచి సమ్మదమున గాఢాలింగనంబు చేసి; తన యంకపీఠంబున నునిచి వినుతించె; వారల గౌరీ దేవియును కృపాకటక్ష యై యుల్లంబున సంతసిల్లి వీక్షించె; నివ్విధంబున సతియునుఁ బతియును గారవించి యిరువురు నిట్లని యానతిచ్చిరి.219

221-వ.అని పలికి.221

224-వ.అనిన విని వీరభద్రవిజయ ప్రకారంబుఁ దెలియ విన్నవించిన వాయుదేవున కమ్మహామును లిట్లినిరి.224

228-వ.అని పలికి సఫలమనోరథు లై వాయుదేవుని స్తుతియించి” రని యివ్విధంబున.228

అశ్వాశాంతము

232-లగ్రా.శంకర! హలాహలభయంకర! పినాకధర!కింకర దిగీశ! యకళంకతరమూర్తీ!పంకజభవాభినుత! పంకజభవాండభవ!సంకలితదైత్యకులసంకట! సుథాపర్యంకనుతనాగకరకంకణవిరాజితకళంక! గిరిజాకుచశుభాంకపరివిలసత్పంకితనితాంత పులకాంకిత యురస్థ్సలమృగాంకశతకోటినిభ! పంకజదళాక్షా!232

235-గ.ఇది శ్రీమన్నహామహేశ్వర యివటూరిసోమనారాధ్య దివ్వశ్రీ పాదపద్మారాధక కేసనామాత్యపుత్త్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవీరభద్రవిజయం బను మహాపురాణ కథ యందు దక్షుయాగంబును, దధీచివివాదంబును, దేవతల పరాజయంబును, వనజనయన వనజభవ ప్రముఖలు మహేశ్వరుని స్తుతించుటయు, వారల మహేశ్వరుండు కరుణించుటయు నన్నది సర్వంబును జతుర్థాశ్వాసము.235

వీరభద్రవిజయము సంపూర్ణము

Valid XHTML 1.0 Transitional

Valid CSS!